క్రిస్మస్, ఆదివారం.. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు. యాదాద్రీశుడి ధర్మ దర్శనానికి 2 గంటలకుపైగా సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటకుపైగా సమయం పడుతోంది. ఆలయ పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలకు అనుమతి లేదు.
వేములవాడ రాజన్న ఆలయంలోనూ భక్తుల రద్దీ నెలకొన్నది. రాజన్న దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. బద్ది పోచమ్మ ఆలయంలోనూ భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. బద్ది పోచమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు బారులుతీరారు.