హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సులకు రెండోవిడత కౌన్సెలింగ్ ఈ నెల 20 నుంచి 23 వరకు జరుగనున్నది. తొలివిడత కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్ల భర్తీకి ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ సుధీర్కుమార్ తెలిపారు. వివిధ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను www.pjtsau.edu.inలో చూడాలని సూచించారు.