CM KCR Press Meet : కేంద్ర ప్రభుత్వం దేశాన్ని మొత్తం నాశనం చేస్తం అంటే చూస్తూ ఊరుకోమని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. వీళ్లను నమ్మితే సర్వనాశనం అయిపోతం. మేము ఎంత పని చేసినమో రైతులకు తెలుసు. 7 ఏళ్ల కింద మూడు ఎకరాల రైతు పరిస్థితి ఏంది. ఇప్పుడు రైతు పరిస్థితి ఏంది. 7 ఏళ్ల కింద తెలంగాణ పల్లెల్లో ఎంత డబ్బు ఉంటుండే.. ఇప్పుడు ఎంత డబ్బు ఉంది. ఇవన్నీ నిజాలు కావా? తెలంగాణలో భూముల ధరలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాయి. చాలామంది దుర్మార్గులు, దరిద్రులు.. బుట్ట చోర్ గాళ్లు.. పనికిమాలినోళ్లు.. తెలంగాణ రాష్ట్రం వస్తే భూముల ధరలు పడిపోతాయి అన్నారు. పడిపోయినా మరి ఇప్పుడు.
20 లక్షల లోపుల భూమి దొరుకుతోందా ఇవాళ తెలంగాణలో ఎక్కడైనా. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది తెలంగాణ రైతు వాల్యూ. 5 ఎకరాలు ఉన్న తెలంగాణ రైతు నేడు కోటీశ్వరుడు. 7 ఏండ్ల కింద 5 ఎకరాలు ఉన్న రైతు బిచ్చగాడు. వలసపోయిండు. కూలీ పనికి హైదరాబాద్ పోయిండు. తెలంగాణలో నేడు ఎక్కడ పోయినా 20 లక్షల లోపు ఎకరం జాగ లేదు. రోడ్డు సైడ్ ఉంటే 30 లక్షలు.. 40 లక్షలు.. 50 లక్షలు.. నేషనల్ హైవేకు ఉంటే 3 కోట్లు.. 4 కోట్లు. ఆనాడు ఆంధ్రాలో ఎకరం అమ్మి.. ఇక్కడ 3 ఎకరాలు కొన్నరు. నేడు నల్గొండ రైతులు ఎకరం అమ్మి.. ప్రకాశం జిల్లాలోకి వెళ్లి 5 ఎకరాలు కొంటున్నరు. ఇక్కడ ఒక ఎకరం అమ్మి కర్ణాటకలో 3 ఎకరాలు భూములు కొంటున్నారు. ఇది ఫ్యాక్ట్ కాదా? ఖచ్చితంగా మేము తెలంగాణలో ఏది సాధించాలనుకున్నామో అది సాధించాం. తెలంగాణలో రైతులు కోటీశ్వరులు అయ్యారు.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.