CM KCR Press Meet : కేంద్ర ప్రభుత్వం.. రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుపై తెలంగాణ కేబినేట్ భేటీ ముగిసిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడిన సీఎం.. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ఎండగట్టారు.
దేశంలో ఆహార ధాన్యాలను సేకరించడం.. సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం.. అలాగే దేశ ఆహార భద్రత కోసం బఫర్ స్టాక్స్ నిలువ చేయడం( దేశాన్ని ఆహార రంగంలో స్వావలంభనగా ఉంచడం కోసం బఫర్ స్టార్స్ నిలువ చేస్తాయి ఏ దేశాలు అయినా), సేకరించిన ధాన్యంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆహార కొరత ఏర్పడకుండా.. ఆహార రక్షణ కోసం ఫుడ్ సెక్యూరిటీ కోసం బఫర్ స్టాక్స్ను మెయిన్టెన్ చేస్తాయి. ఆ తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థకు ఆహార ధాన్యాలను అందించి నిరుపేదలకు అందించడం.. ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రాజ్యాంగ బద్ధంగా కేంద్రం మీద ఉన్న బాధ్యత.
ఈ బాధ్యత అనేక సంవత్సరాల నుంచి జరుగుతోంది. కొత్తగా ఈరోజు జరగడం లేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జరుగుతోంది. కానీ.. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయి రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారు. పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజల వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారు. గ్యాస్ ధరల పెంపు కావచ్చు.. పెట్రోల్ ధరల పెంపు కావచ్చు.. ఇట్లా అనేక రంగాల్లో కనిపిస్తున్నాయి. ఈ ధాన్యాన్ని ప్రొక్యూర్ చేసి ఆహార భద్రతను పరిరక్షిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను నడపాల్సిన కేంద్రం ఈరోజు దురదృష్టకరంగా తన సామాజిక బాధ్యతను విస్మరించి మేం కొనము.. కొనలేము అని చెబుతున్నారంటూ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.