ఇటిక్యాల: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని బీచుపల్లి క్షేత్రంలోని లక్ష్మీహయగ్రీవ సమేత జ్ఞాన సరస్వతి ఆలయంలో నాలుగో రోజు అమ్మవారు ధైర్యలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భువనచంద్ర అమ్మవారికి పాతఃకాల సుప్రభాత సేవ, శుద్ధి తిరువారాధన, కుంకుమా ర్చనలు, నైవేధ్య నిరాజనాలు, చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించారు.
కార్యక్రమాలను ఆలయ మేనేజర్ సురేందర్రాజు పర్యవేక్షించారు. అలాగే ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన అమ్మవారు అన్నపూర్ణగా భక్తులకు దర్శనమిచ్చారు.