హైదరాబాద్ : తెలంగాణలో తాజాగా మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 44 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ఒమిక్రాన్ నుంచి 10 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే న్యూఇయర్ వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది.