నిర్మల్, అక్టోబర్ 19 : సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని, మూడవ సారి బీఆర్ఎస్కే పట్టం కట్టాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మామడ మండలం వాస్తవాపూర్ గ్రామానికి వచ్చిన మంత్రికి అపూర్వ స్వాగతం లభించింది. గుస్సాడీ నృత్యంతో, మంగళహారతులతో, బతుకమ్మ ఆటపాటలతో మహిళలు మంత్రికి స్వాగతం పలికారు.
వృద్ధులు, యువ ఓటర్లను కలుస్తూ..అభివృద్ధి ఆగవద్దు, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే.. బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇటీవల ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ మేనిపేస్టో నిరుపేదలకు వరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తామని మాటిచ్చారు. అంతకుముందు వాస్తవపూర్ అంజనేయ స్వామిని దర్శించుకుని మంత్రి పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు మన బతుకులు ఎట్లుండే.. తెలంగాణ వచ్చినంకా మన బతుకులు ఎట్ల బాగుపడ్డాయో మనమ కళ్ల ముందు కనపడుతున్నది. వాస్తవాపూర్కు 25 ఏండ్ల క్రితం వరకు రోడ్ లేకుండే గతంలోనే ఈ ఊరికి రహదారి సౌకర్యం కల్పించాం. ప్రధాన రహదారి నుంచి ఇక్కడికి మూడు నిమిషాల్లోనే వస్తున్నం. గిరిజనులు కల్పషం లేని మనుషులు, కోపతాపాలు ఉండవు.
ఎన్నికల సమయంలో మీ ఊరికి వచ్చి మీ ఆశీర్వాదం తీసుకోవడం అనవాయితీగా మారింది. అందుకే మీ ఆశీర్వాదం కోసం మీ ఊరికి వచ్చిన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదించండి. ఎల్లవేళలా మీకు అండగా ఉంటానని హామీనిచ్చారు. గిరిజనులు, ఆదివాసీల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ తోనే మరింత అభివృద్ధి సాధ్యమని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు.