హైదరాబాద్ : సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) ఇంటింటి ప్రచారం నాలుగోరోజు ఆదివారం సనత్ నగర్ డివిజన్లో ఎంతో ఉత్సాహంగా సాగింది. ఏ ఇంటికెళ్లినా శ్రీనన్న మీకే మా ఓటు అంటూ ప్రకటిస్తున్నారు. అనేక అభివృద్ధి పనులు చేసి మా సమస్యలు పరిష్కరించిన మిమ్మల్ని ఈ సారి ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఎంతో అభిమానంతో మంత్రి చేతిలో చేయి కలిపి చెబుతున్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు సమస్యలతో సతమతమయ్యే వారని అన్నారు. 2014 తర్వాత ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ నాయకత్వంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతం నుంచి ఎన్నికై ముఖ్యమంత్రిగా పని చేసిన మర్రి చెన్నారెడ్డి కూడా చేయలేని అభివృద్ధి పనులను తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేశామని చెప్పారు.
అభివృద్ధిలో సనత్ నగర్ను ఆదర్శంగా తీర్చిదిద్దామని, మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తీ మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ పుట్ట శేఖర్, మాజీ అధ్యక్షుడు ఖలీల్, నాయకులు నోమాన్, సమీర్, సరాఫ్ సంతోష్, సురేష్ గౌడ్, కర్ణాకర్ రెడ్డి, ఇబ్రహీం, రాజు, ప్రకాష్ రెడ్డి, పాజిల్, అంజద్, పుష్పలత, పద్మ, లలితా చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్కు మద్దతు తెలిపిన ఎంఐఎం
మంత్రి తలసాత్ ఎంఐఎం పార్టీ నాయకులు తమ మద్దతును తెలిపారు. ఆదివారం సనత్ నగర్లో మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో MIM పార్టీ నాయకులు షౌకత్, జావీద్, షుకూర్ ఆధ్వర్యంలో అక్కడకు చేరుకొని తమ మద్దతును ప్రకటించారు. మంత్రి తలసాని గెలుపే లక్ష్యంగా పని చేస్తామన్నారు. అనంతరం వారు మంత్రితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.