సంగారెడ్డి : కాంగ్రెస్ పార్టీ అంటే నయవంచన..బీఆర్ఎస్ అంటే ఒక నమ్మకమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. ఆందోల్ నియోజకవర్గంలో నిర్వహించిన అలాయ్ బలయ్(Alai Balai) కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఆనాడు 2018లో అలయ్ బలయ్తో క్రాంతి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారని స్పష్టం చేశారు. అనాడు తెంగాణ కోసం 11 రోజులు ఆమరణ దీక్ష చేసి కేసీఆర్ ఢిల్లీమెడలు వంచాడు.
తెలంగాణను నిలబెట్టుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తుంటే.. ప్రతిక్షాలు ఆగం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ దుష్ట పాలనకు ప్రత్యక్ష సాక్ష్యం పక్కనున్న కర్ణాటక పరిస్థితులే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ అంటే నే ఝూటాకోర్ పార్టీ. 2009 లో ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. కాంగ్రె సోళ్లను నమ్మితే మోసపోతాం. కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ కాపీకొడుతుందన్నారు. మనది అద్భుతమైన మేనిఫెస్టో, ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
పనితనం తప్పా, పగ తనం తెలియని నాయకుడు కేసీఆర్. లేదంటే కాంగ్రెస్ వాళ్లు సగం మంది జైల్లో ఉండేవారన్నారు. గోరటి వెంకన్న పల్లెపల్లేనా పల్లేర్లు మొలిచే అని పాట రాశారు. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అనీ రాశారు. ఇలాంటి పాటలు నేడు అన్ని తిరగ రాయాల్సిన పరిస్థితులు వచ్చాయని, దీనికి బీఆర్ఎస్ పాలనే కారణమన్నారు. కండ్ల ముందు, ఇంటి ముందు కనబడ్డ అభివృద్ధి నమ్మాలి. అచ్చం గా లోకల్ బిడ్డ క్రాంతిని నిండు మనసుతో దీవించాలని విజ్ఞప్తి చేశారు.