రాజన్న సిరిసిల్ల : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీ నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామానికి చెందిన బీజేపీ యువ మోర్చా సీనియర్ నాయకుడు గుంటి గంగాధర్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, బండపల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు, మహిళలు వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహా రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
పార్టీలో చేరిన వారికి జడ్పీ చైర్ పర్సన్ అరుణ, లక్ష్మీ నరసింహా రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రతి పక్షాలకు చోటు లేదన్నారు. సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ను బొందను పెట్టాలన్నారు. ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ అలవి కానీ హామీలనిస్తూ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. రైతుబంధు వద్దంటున్న ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.