మేడ్చల్, అక్టోబర్22(నమస్తే తెలంగాణ): శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సింగిల్ డిజిట్కే పరిమితవుతారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు. బోయిన్పల్లిలోని మంత్రి నివాసం వద్ద ఆదివారం మేడ్చల్ నియోజకవర్గంలోని భోగారం, రాంపల్లి దయర గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్(BRS)లో చేరారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తుందని ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పాడిన నాటి నుంచి తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడన్నారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ను తప్ప కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మె పరిస్థితిలో లేరన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీజేపీ పార్టీల అడ్రస్ గల్లంతు కావడం ఖాయంగా కనిపిస్తుందన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులకు ఎన్నికల్లో ప్రజలు బుద్దిచేప్పేందుకు సిద్దమవుతుందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలకు వలసలు బాగా పెరుగుతున్నాయని, రాష్ర్టాభివృద్ధిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతు తెలుపుతున్నారని స్పష్టం చేశారు.