హైదారాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ ‘నోట్ల కట్టల పాములు’ బుసలు కొడుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న దురాలోచనతో ఎంతకైనా తెగబడుతున్న ఆ పార్టీ ధన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఖమ్మం జిల్లాలో పోటీచేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని శపథాలు చేసిన నాయకుడే గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఆయన తన అనుచరగణంతో హైదరాబాద్ నుంచి ‘క్యాష్ కాన్వాయ్’ను రప్పిస్తూ అడ్డంగా పట్టుబడ్డాడు. మరోవైపు అక్రమంగా సంపాదించిన సొమ్ము నుంచి తొలుత చెరొక రూ.4 కోట్లను తమ నియోజకవర్గాల్లో పంచి గెలువాలనుకుంటున్న అన్నదమ్ములు సైతం దొరికిపోయారు. ఇంకోవైపు తన కొడుకును ఎమ్మెల్యేగా చేయాలని భావించిన ఓ కాంగ్రెస్ కురువృద్ధుడు తనకు తానే డమ్మీ నామినేషన్ వేసుకొని.. కొడుకు కోసం రూ.కోట్లు పంచేందుకు సిద్ధయ్యాడు. ఇలా ఎంతోమంది కాంగ్రెస్ నేతలు తమ రాజకీయ భవితవ్యం కోసం భారీగా డబ్బు వెదజల్లేందుకు ‘కోట్ల కుతంత్రాలు’ పన్నుతున్నారు.
చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కాం గ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అన్నదమ్ములు గ డ్డం వివేక్, వినోద్ మధ్యన రూ.8 కోట్లు కలక లం సృష్టించాయి. అన్న డబ్బులో తమ్ముడికి, తమ్ముడి డబ్బులో అన్నకు ఉన్న లింకులను సాక్షాత్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులే బుధవారం బయటపెట్టారు. వివేక్ తన విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ అకౌంట్ నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ అనే బోగస్ సంస్థకు బదిలీ అయిన ఈ రూ.8 కోట్లను అన్నదమ్ములిద్దరూ చెరిసగం తమ నియోజవర్గాలకు తరలించేందుకు కుట్ర పన్నిన్నట్టు తేలడంతో వివేక్ ఇండ్లు, ఆఫీసులు, ఇతర కార్యాలయాల్లో ఐటీ, ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అక్కడ పలు డాక్యుమెంట్లు, వస్తుసామగ్రి స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా ఆ రూ.8 కోట్లలో వినోద్ పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. ఆయన ఇండ్లతోపాటు హెచ్సీఏలోనూ సోదాలు జరిపారు. దీంతో ఆ అన్నదమ్ముల అసలు రంగు బయటపడింది. వివేక్ ఖాతా నుంచి బదిలీ అయిన రూ.8 కోట్లలో చెన్నూరుకు సగం, బెల్లంపల్లికి సగం తరలించాలని వారు ప్రయత్నించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్ నుంచి రావాల్సిన ‘క్యాష్ కా న్వాయ్’ని మధ్యలోనే పోలీసులు అడ్డుకోవడంతో ఖమ్మానికి చెందిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇరకాటంలో పడినట్టు ఆయ న సన్నిహిత వర్గాలే చెబుతున్నాయి. గతంలో ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచిన ఆయన ఇప్పు డు తొలిసారిగా పాలేరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నాడు. బీఆర్ఎస్ను వీడిన వెంటనే స్థానిక పార్టీ నేతలపై కక్షగట్టిన పొంగులేటి.. ఖమ్మం జిల్లా నుంచి ఏ బీఆర్ఎస్ అభ్యర్థినీ అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని ధనమదంతో శపథం చేశాడు. కానీ, పొంగులేటి ‘క్యాష్ కాన్వాయ్’ మధ్యలోనే అడ్డంగా దొరికిపోవడంతో ఆయన దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న దురుద్దేశంతో ఖమ్మంలోని తనకు తెలిసిన ఫైనాన్సర్ల సహాయం తీసుకుని, వారి ద్వారానే ఓటర్లకు డబ్బు పంచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ‘క్యాష్ కాన్వాయ్’పై విచారణ తుదిదశకు చేరుకోవడంతో ఈ వ్యవహారంలో తన పేరు బయటికి రాకుండా చూసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.
నాగార్జునాసాగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఇప్పటికే రెండుసార్లు ఓటమిపాలైన కాంగ్రెస్ రాజకీయ కురువృద్ధుడు కే జానారెడ్డి ఈసారి ఎలాగైనా తన కొడుకును ఎమ్మెల్యే చేయాలని తహతహలాడుతున్నాడు. అందుకోసం తనకు తానుగా డమ్మీ నామినేషన్ వేసి, తిరస్కరణకు గురయ్యాడు. తన చరిష్మా తగ్గిపోవడంతో కొడును రంగంలోకి దించిన ఆయన.. తెరవెనుక డబ్బు పంపకాలను చేపట్టినట్టు ఎన్నికల అధికారులే గుర్తించారు. ఈ క్రమంలో ఐటీ సోదాలు జరిపి, భారీగా నగదును పట్టుకెళ్లారు. మరోవైపు మహేశ్వరం టికెట్ ఆశించి భంగపడిన ఓ కాంగ్రెస్ నాయకురాలి ఇంట్లో జరిపిన ఐటీ సోదాల్లోనూ భారీగా డబ్బు దొరికింది. అప్పటికే ఆమె తన టికెట్ కోసం డబ్బులు చెల్లించింది. కానీ, ఆమెకు కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో భర్తను ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వద్దకు పంపి ఆ డబ్బును తిరిగి తీసుకున్నట్టు తెలిసింది.