రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు అధునాతన శాస్త్రీయ సలహాలు, సూచనలు అందించేందుకు ఉద్యాన సాంకేతిక సమాచార కేంద్రాన్ని ఉద్యాన వర్సిటీలో త్వరలోనే ఏర్పాటుచేయనున్నట్టు వర్సిటీ వీసీ రాజిరెడ్డి వెల్లడించారు.
రైతులకు మేలుచేసే పరిశోధనలతోపాటు వారి తలసరి ఆదాయం పెరిగే మార్గాలపై ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలు దృష్టిసారించాలని రాష్ట్ర వ్యవసాయ సహకారశాఖ కార్యదర్శి కే సురేంద్రమోహన్ సూచించారు. 2047 నాటికి తెలంగాణ రైత�