యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం సెలవుదినం కావడంతో స్వయంభూ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి తిరువీధి సేవోత్సవం వైభవంగా సాగింది. బుధవారం సాయంత్రం స్వామి వారిని గరుఢ వాహనం, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై వేంచేపు సేవను కొనసాగించారు.