ఉమ్మడి పాలమూరు జిల్లాలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా విపరీతమైన ఎండల నేపథ్యంలో ఉక్కపోత, వేడిగాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇండ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు.
ఎండలు దంచికొడుతున్నాయి. రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మంగళవారం జిల్లాలోనే జహీరాబాద్లో 42.7 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదైంది. కోహీర్ మండలంలోని దిగ్వాల్లో 42.4, కోహీర్ పట్టణ