ఖనిజ ధరలను పెంచినట్టు ఎన్ఎండీసీ ప్రకటించింది. టన్ను ఖనిజ ధరను రూ.200 పెంచిన సంస్థ.. నాణ్యమైన టన్ను ఖనిజ ధరను రూ.150 సవరించింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయని పేర్కొంది.
ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ మెరుగైన పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు సంస్థ 40.24 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది.