న్యూఢిల్లీ, జూన్ 3 : ఖనిజ ధరలను పెంచినట్టు ఎన్ఎండీసీ ప్రకటించింది. టన్ను ఖనిజ ధరను రూ.200 పెంచిన సంస్థ.. నాణ్యమైన టన్ను ఖనిజ ధరను రూ.150 సవరించింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయని పేర్కొంది.
అలాగే ప్రస్తుత త్రైమాసికంలో ఖనిజ ధరలను పెంచడం ఇది మూడోసారి కావడం విశేషం. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో బైలా లంప్సం ఖనిజ టన్ను ధర రూ.5,700కి చేరుకోగా, నాణ్యమైన రకం రూ.4,850గా నమోదైంది.