న్యూఢిల్లీ, మార్చి 1: ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ మెరుగైన పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు సంస్థ 40.24 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఉత్పత్తి చేసిన 35.62 మిలియన్ టన్నులతో పోలిస్తే 13 శాతం అధికమని పేర్కొంది. ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 33.42 మిలియన్ టన్నుల నుంచి 21 శాతం ఎగబాకి 40.48 మిలియన్ టన్నులకు చేరుకున్నట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. కానీ, ఫిబ్రవరిలో కంపెనీ ఉత్పత్తి ఏడాది ప్రాతిపదికన 12 శాతం తగ్గి 4.48 మిలియన్ టన్నుల నుంచి 3.92 మిలియన్ టన్నులకు పడిపోగా, అమ్మకాల విషయానికి వస్తే 3.78 మిలియన్ టన్నుల నుంచి 3.99 మిలియన్ టన్నులకు పెరిగింది.