కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లిలో రైతు కూన సదానందం వరి, మక్క పంటలను రక్షించుకునేందుకు నాలుగు కిలోమీటర్ల నుంచి ట్యాంకర్ ద్వారా నీళ్లు తెచ్చి పంటలకు అందిస్తున్నాడు.
నీళ్లు లేక ఎండుతున్న పొలాలను చూసి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. రిజర్వాయర్లో నీరున్నా కాలువలకు విడుదల చేయకపోవడంతో వేలాది ఎకరాల వరి పొలాలు ఎండిపోతున్నాయి.
ఎండుతున్న పైరును చూసి రైతన్న కన్నీరు పెడుతున్నాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో చెరువులు, చెక్డ్యాంల్లో నీరు లేకపోవడంలో భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో చుక్క నీరు రావడం లేదు.