ఈ నెల 8 నుంచి జరగాల్సిన ది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(సీయూఈటీ)-యూజీ పరీక్షను వాయిదా వేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పరీక్ష జరిగే తాజా తేదీలను త్వరలో ప్రకటించనున్నట్టు పేర్కొన్నాయి.
సెంట్రల్ యూనివర్సిటీలు సహా ఇతర విద్యాసంస్థల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ యూజీ ఎగ్జామ్ను హైబ్రీడ్ పద్ధతిలో నిర్వహించనున్నారు.