హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : సెంట్రల్ యూనివర్సిటీలు సహా ఇతర విద్యాసంస్థల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ యూజీ ఎగ్జామ్ను హైబ్రీడ్ పద్ధతిలో నిర్వహించనున్నారు. దీనిపై ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకోగా, ఈ ఏడాది నుంచే అమలుచేయనున్నారు. ఈ పరీక్షను రెండేండ్ల నుంచి ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ఈసారి ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ నిర్వహించే అంశాన్ని ఎన్టీఏ పరిశీలిస్తున్నది.