తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖను అవినీతిరహితంగా తీర్చిదిద్దాలంటే ఆ శాఖ ప్రక్షాళన జరుగాలని, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయాలను సమర్ధంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు.
దేవాదాయ, ధర్మాదాయశాఖలో పేరుకుపోతున్న దస్ర్తాలు, టెండర్ల ఆమోదం, మతపరమైన ఉద్యోగ నియామకాల్లో గందరగోళంపై నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం ఆ శాఖలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.