వచ్చే నెల 27 నుంచి అక్టోబర్ 05 వరకు ఢిల్లీ వేదికగా జరుగబోయే వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్కు తెలంగాణ నుంచి దీప్తి జివాంజీ, బానోతు అకీరా నందన్ ఎంపికయ్యారు.
మొరాకో వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ప్రి టోర్నీలో తెలంగాణకు చెందిన బానోతు ఆకీరా నందన్ అదరగొట్టాడు. 400మీటర్ల రేసును 53.07 సెకన్లలో పూర్తి చేసిన అకీరా పసిడి పతకంతో మెరిశాడు.