వచ్చే నెలలో జపాన్ ఆతిథ్యమివ్వనున్న ఆసియా క్రీడల్లో క్రికెట్ పోటీల షెడ్యూల్ విడుదలైంది. నేరుగా క్వార్టర్స్ నుంచి ఆడనున్న భారత పురుషుల, మహిళల జట్లు.. వరుసగా రెండో స్వర్ణంపై కన్నేశాయి.
ఆసియా గేమ్స్లో భారత క్రికెట్ జట్లు (మెన్స్, ఉమెన్స్) నేరుగా క్వార్టర్స్ నుంచే బరిలోకి దిగనున్నాయి. ఇరు విభాగాల్లోనూ డిఫెండింగ్ చాంపియన్లుగా ఉన్న భారత్.. వరుసగా రెండో స్వర్ణం కోసం బరిలోకి దిగనుంది.