అర్వపల్లి: సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి నోచుకు న్నాయని తుంగతుర్తి ఎ మ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని యోగానంద లక్ష్మీ నృసింహాస్వామి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న సుదర్శన హోమం లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
అతి పురాతన ఆలయ మైన శ్రీయోగానంద లక్ష్మీ నృసింహాస్వామి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఇప్పటికే 1.20 కోట్ల రూపాయలతో ఆలయ పునఃని ర్మాణం చేపట్టినట్లు చెప్పారు. ఆలయ పునః నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేయాలని దేవాదాయ శాఖ అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గజమాలతో సన్మానించి స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు.
కార్యక్రమంలో ఎంపీపీ మన్నె రేణుక, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్రెడ్డి, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్ ఎర్ర నర్సయ్య, ఆలయకమిటీ ఛైర్మన్ చిల్లంచర్ల విద్యాసాగర్, సర్పంచ్లు బైరబోయిన సునీత, పుప్పాల శేఖర్, నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, మొరిశెట్టి ఉపేందర్, కనుకు శ్రీనివాస్, పులిచర్ల ప్రభాకర్, పెరుమాళ్ల వెంకటయ్య, బొడ్డు రామలింగయ్య, రవిందర్ నాయక్, కడారి నరేశ్, సురేశ్, ప్రభు, సంతోష్ పాల్గొన్నారు.