సూర్యాపేట: జిల్లాలో ఉన్న 1209 అంగన్వాడీ కేంద్రాలను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించాలని జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్వాడీ టీచర్లు, సూపర్ వైజర్లు, ప్రాజెక్ట్ అధికా రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రా ల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వారంలో రెండు దఫాలుగా శానిటైజేషన్ చేయించి ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రారం భించాలని తెలిపారు. లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించటంలో ఏటువంటి అంతరాయం లేకుండా చూడాలని గుత్తేదారు లకు సూచించారు.
పౌష్టికాహారం సరఫరాలో నాణ్యత లోపించకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. క్రమం తప్పకుండా తల్లీబిడ్డల బరువు చూసి వారికి ఆరోగ్య జాగ్రత్తలు సూచించాలని అన్నారు. తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలను గుర్తించి రోగ్య శాఖ వారి సమన్వయంతో రిహాబిలిటేషన్ సెంటర్కు పంపి సాధారణ స్థితి వచ్చే వరకు పర్యవేక్షించాలని కోరారు. అదేవిధంగా జిల్లాలోని అంగన్ వాడీ టీచర్లు,ఆయాల భర్తీకి సంబంధించి ప్రాజెక్ట్ పరిధిలో దృవ పత్రాల పరిశీలన పారదర్శకంగా జరపాలని తెలిపారు.