బొడ్రాయిబజార్: అంగన్వాడీ కేంద్రాల సేవలను మరింత విస్త్రతం చేసి గర్బిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషణ లోపా న్ని నివారించేందుకు కృషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతిపద్మ అన్నారు. మంగళవారం పట్టణంలోని జే ఫంక్ష న్హాల్లో పోషణ మాసంలో భాగంగా ఏర్పాటు చేసిన సామూహిక సీమంతాలు, అక్షరాభ్యాసం, అన్నప్రసన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
దేశవ్యాప్తంగా పోషణ లోపం లేకుండా ఆరోగ్య బారత్-ఆరోగ్య తెలంగాణ లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పోషణ అభియాన్ పథ కంలో భాగంగా లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సూచనలు జారీ చేశారు. పెరుగు దల, పర్యవేక్షణ కోసం అనుసరిస్తున్న విధానాల యొక్క నాణ్యతను పరిశీలించి పోషణ లోపం లేకుండా ఉండాలంటే పెరుగుదల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించి వారి ఆరోగ్య స్థితిపై, పౌష్టికాహా రంపై అవగాహణ కల్పించాలన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవ కార్యక్రమాల్లో భాగంగా పెరుగుదల, పర్యవేక్షణ, పెరటితోట పెంపకం, యోగా మెలకువలు, రక్తహీనత లోపం ఈ నాలుగు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి జన చైతన్యం తీసుకొచ్చి ఆరోగ్య భారత్- ఆరో గ్య తెలంగాణ కోసం కృషి చేస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆధునిక పరికరాల ద్వారా పెరుగుదల పర్యవేక్షణ చేస్తూ పోషణ లోపం తీవ్ర పోషణ లోపంతో బాధపడే వారిని గుర్తించి అదనపు పోషక ఆహారం అందించడమే కాకుండా ఆరోగ్యశాఖ సమన్వయంతో ఎన్ఆర్సీకి సిఫార్సు చేసి వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతామన్నారు.
పెరటి తోటల పెంపకంలో భాగంగా జిల్లాలో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు విత్తనాలు పంపిణీ చేయడం జరిగిందని సేంద్రీయ పద్దతిలో ఈ పెరటి తోటలు సాగు చేసి లబ్దిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందజేయడం లక్ష్యమన్నారు. యోగా చేయడం ద్వారా కలిగే లాభాలపై విస్త్రతంగా ప్రచారం నిర్వహించి అవగాహణ కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ టీసాట్ వినియోగించుకొని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై అవగాహన పెంచుకోవాలన్నారు.
సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీటీసీ జీడి భిక్షంలు మాట్లాడుతూ అంగన్వాడీ కేం ద్రాల ద్వారా అందిస్తున్న సేవలను గర్బిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకొని పోషణ లోపం లేకుం డా చూసుకోవాలన్నారు.
కార్యక్రమంలో పెన్పహాడ్ జడ్పీటీసీ మామిడి అనిత, సూర్యాపేట వైస్ ఎంపీపీ శ్రీనివాస్ నాయుడు, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ సంపత్, ఆయా గ్రామాల సర్పంచ్లు, వార్డు సభ్యులు, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, సఖీ కేంద్రం, భరోసా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.