సూర్యాపేట, నవంబర్ 28 : దేశ అభివృద్ధికి రాజ్యాంగం దిక్సూచిలాంటిదని జడ్పీసీఈఓ సురేశ్ అన్నారు. శనివారం జడ్పీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళుర్పించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సూర్యాపేట ఎంపీపీ రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, ఎంపీడీఓ శ్రీనివాస్రావు, జడ్పీ సిబ్బంది పాల్గొన్నారు.
సూర్యాపేట లీగల్ : జిల్లాకేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.గౌతమ్ ప్రసాద్, ప్రథమశ్రేణి న్యాయమూర్తి సురేశ్, అడిషనల్ ప్రథమశ్రేణి న్యాయమూర్తి జె.ప్రశాంతి, మండల సభ్యులు ఎం.వెంకన్న, ఎ.అశోక్, బార్ అసోసియేషన్ కార్యదర్శి సోమేశ్వర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.రాంరెడ్డి, వి.సత్యనారాయణపిళ్లె పాల్గొన్నారు.
బొడ్రాయిబజార్ : జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మెప్మా పీడీ రమేశ్నాయక్, డీఈ సత్యరావు, ఆర్ఓ జ్ఞానేశ్వరి, ఎస్ఎస్ఆర్.ప్రసాద్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తిరుమలగిరి : పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి జలాభిషేకం చేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్ పాల్గొన్నారు.
తుంగతుర్తి : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ భీమ్సింగ్ అధ్యక్షతన రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ జిల్లా నాయకురాలు కవితారాములుగౌడ్ పాల్గొన్నారు.
నూతనకల్ : మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంతో పాటు ఎర్రపహడ్లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తాసీల్దార్ జమీరుద్దిన్, ఎంపీడీఓ ఇందిర, ఎంపీటీసీ గాడ్దుల లింగరాజు పాల్గొన్నారు.
అర్వపల్లి : మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రతిజ్ఞ చేశారు. ఎంపీపీ మన్నె రేణుకాలక్ష్మీనర్సయ్యయాదవ్, ఎంపీడీఓ విజయ, సీనియర్ అసిస్టెంట్ రాజు, పాల్గొన్నారు.
నేరేడుచర్ల/ కోదాడ రూరల్ /చిలుకూరు/గరిడేపల్లి/ చింతలపాలెం / మఠంపల్లి, నవంబర్ 26 : జిల్లావ్యాప్తంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. నేరేడుచర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శంకరయ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కోదాడ ఎంపీడీఓ కార్యాలయం, కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, సోషల్ యాక్టివిటీ ఫోరం, కోదాడ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. చిలుకూరు మండలవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి కేవీకేలో, చింతలపాలెం మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మఠంపల్లి మండలంలోని గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.
రాజ్యాంగం గొప్పతనాన్ని భావితరాలకు తెలపాలి : ఎస్పీ
సూర్యాపేట సిటీ : రాజ్యాంగం గొప్పతనాన్ని భావితరాలకు తెలుపాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎస్పీలు నాగభూషణం, రవి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ నర్సింహ, సీఐలు పాల్గొన్నారు.
పౌరులందరికీ సమాన హక్కులు: అదనపు కలెక్టర్ మోహన్రావు
సూర్యాపేట, నవంబర్ 26 : భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు రామారావునాయక్, రాంపతినాయక్, శ్రీదేవి, దున్న శ్యాం పాల్గొన్నారు.