సూర్యాపేటటౌన్, జనవరి 23 : కొవిడ్ కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతిన్న చిన్నారి చికిత్సకు మంత్రి జగదీశ్రెడ్డి భరోసా కల్పించారు. మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారు. సూర్యాపేటలోని 20వ వార్డు జమ్మిగడ్డకు చెందిన గోపగాని శ్రీవిద్య- అశోక్ దంపతుల కుమార్తె చైత్ర(9) 8నెలల క్రితం కొవిడ్ బారిన పడింది. వైరస్ బాలిక అవయవాలను ఛిద్రం చేసిన విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించలేకపోయా రు. వారు మేల్కొని చికిత్స చేయించేలోపే ఊపిరితిత్తులు, నరాలు దెబ్బతిన్నాయి. ఎన్ని దవాఖానలకు తిరిగినా నయం కాక పోవడంతో చిన్నారి 8 నెలలుగా ఆక్సిజన్ సాయంతోనే బతుకుతున్నది. ఇటీవల కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో భాగంగా సూర్యాపేటలో పర్యటించిన మంత్రికి చిన్నారి తల్లిదండ్రులు విషయం తెలుపడంతో తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వెంటనే సూర్యాపేట మెడికల్ కళాశాల వైద్య సిబ్బందితో ఫోన్లో మాట్లాడి చిన్నారికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స ప్రారంభింపజేశారు. దాంతోపాటు చైత్ర ఆరోగ్య సమాచారాన్ని మంత్రి ఎప్పటికప్పుడు సూర్యాపేట మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ మురళీధర్రెడ్డిని అడిగి తెలుసుకుంటున్నారు. పాపకు వైద్యం అందించేందుకు గుంటూరు, నిలోఫర్, ఖమ్మం ఆస్పత్రుల చుట్టూ తిరిగి అలసిపోయిన తమకు ఎదురొచ్చిన దేవుడి రూపంలో మంత్రి జగదీశ్రెడ్డి దర్శనమిచ్చారంటూ చిన్నారి తల్లిదండ్రులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
మంచానికే పరిమితమైన మరో యువకుడికి
రోడ్డు ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతిని మంచానికే పరిమితమైన జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్కు చెందిన మొండికత్తి వినీత్కు మంత్రి జగదీశ్రెడ్డి తానున్నానంటూ భరోసా ఇచ్చారు. పళ్లైన కొత్తలోనే వినీత్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. వెన్నుపూస దెబ్బతినడంతో మంచానికే పరిమితమయ్యాడు. వార్డులో పర్యటిస్తున్న మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఈ విషయాన్ని గమనించారు. వెంటనే నిమ్స్ వైద్యులతో మాట్లాడి యువకుడి వెన్నుపూసకు ఆపరేషన్ చేయాలని ఆదేశించారు. ఆయన వైద్యానికి అయ్యే ఖర్చు తాను భరిస్తానని హామీ ఇచ్చారు. మంత్రి ఇచ్చిన భరోసాతో యువకుడికి జీవితంపై కొత్త ఆశలు రేకెత్తాయి. తమ కుమారుడి జీవితానికి భరోసా ఇచ్చిన మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డికి యువకుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.