సూర్యాపేట రూరల్, మార్చి30 : మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రిలో గల లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజు నిర్వహించిన పుష్పయాగం కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బడుగుల మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆలయ అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ సమన్వయ కమిటీ సభ్యులు రాపర్తి మహేశ్, బంగారి చిన మల్లయ్య, సట్టు పుష్పావెంకన్న, కొరివి సతీశ్, నాయకులు వల్లాల సైదులుయాదవ్, రాపర్తి సైదులు, బంగారి శ్రీను, చెర్కుపల్లి వెంకట్లాల్, జక్కలి నాగరాజు, అర్చకులు వరదాచార్యులు, ముడుంబై కృష్ణమాచార్యులు, రాఘవాచార్యులు, రామానుజాచార్యులు పాల్గొన్నారు.