కోదాడ రూరల్, మే 28 : కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న టీకాలను సూపర్ స్ప్రెడర్లు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. కోదాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సిన్ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు టెస్టు చేయించుకుని వ్యాధి నిర్ధారణ అయితే వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, ఆర్డీఓ కిశోర్కుమార్, ఏడీఏ వాసు, తాసీల్దార్ శ్రీనివాస్శర్మ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా॥ నిరంజన్, డా॥ శైలజ, టీఆర్ఎస్ నాయకులు బుర్ర పుల్లారెడ్డి, చందు నాగేశ్వర్రావు, యాతాకుల మధు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
టీకానే శ్రీరామరక్ష : డీఐఓ
మునగాల : కరోనా కట్టడికి టీకానే శ్రీరామరక్ష అని డీఐఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సూపర్ స్ప్రెడర్ల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లాలో 5,548 మంది సూపర్ స్ప్రెడర్లను గుర్తించినట్లు తెలిపారు. ఈనెల 27వరకు జిల్లా వ్యాప్తంగా 31 కేంద్రాల ద్వారా 1,46,561 మందికి టీకా వేసినట్లు తెలిపారు. అందులో 1,14,407 మందికి మొదటి డోసు, 31,154 మందికి రెండో డోసు వేసినట్లు చెప్పారు. కార్యక్రమాన్ని ఎంపీపీ బిందు సందర్శించి వైద్య సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ రమేశ్, వెంకటపాపిరెడ్డి, తాసీల్దార్ కృష్ణ, హెచ్ఈఓ షాబుద్దీన్ పాల్గొన్నారు.
కరోనా కట్టడి కోసమే వ్యాక్సినేషన్ : డీఎస్ఓ
మోతె : కరోనా కట్టడి కోసమే సూపర్ స్ప్రెడర్స్కు టీకాలు వేస్తున్నట్లు డీఎస్ఓ(జిల్లా సర్వేలెన్స్ అధికారి)డాక్టర్ నజియా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా 50మందికి కొవిషీల్డ్ టీకా వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తాసీల్దార్ యాదగిరి, ఎంపీడీఓ శంకర్రెడ్డి, డాక్టర్ శ్రీశైలం, వైద్య సిబ్బంది, వీఆర్వోలు పాల్గొన్నారు.
మేళ్లచెర్వు : సూపర్ స్ప్రెడర్లకు ప్రభుత్వం వేస్తున్న టీకాను వినియోగించుకోవాలని హుజూర్నగర్ ఆర్డీఓ వెంకారెడ్డి సూచించారు. మేళ్లచెర్వు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వేసిన టీకాల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఏడీఏ సంధ్యారాణి, ఎంపీపీ కొట్టె పద్మాసైదేశ్వర్రావు, ఎంపీడీఓ ఇసాక్ హుస్సేన్, తాసీల్దార్ దామోదర్రావు, ఎంపీఓ వీరయ్య, వైద్యాధికారులు కిరణ్, ప్రేమ్సింగ్, ఏఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
నేరేడుచర్ల : కరోనా కట్టడి కోసమే ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్లను గుర్తించి వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టిందని తాసీల్దార్ సరిత అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సూపర్ స్ప్రెడర్లకు కరోనా టీకా కార్యక్రమాన్ని నేరేడుచర్ల, పెంచికల్దిన్నె వైద్యాదికారులు నాగయ్య, హరికిషన్తో కలిసి ప్రారంభించారు. డిప్యూటీ తాసీల్దార్ రాంరెడ్డి, ఏఓ వీరభద్రారావు, ఆర్ఐ ప్రవీణ్, మున్సిపల్ మేనేజర్ అశోక్రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
గరిడేపల్లి : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రెడర్స్ టీకా కార్యక్రమాన్ని తాసీల్దార్ కార్తీక్ ప్రారంభించారు. ఏఓ ప్రియతమ్కుమార్, వైద్యాధికారులు బంగారు రమ్య, సుధీర్, ఆర్ఐ తబ్రేజ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పాలకవీడు : ప్రభుత్వం గుర్తించిన సూపర్ స్ప్రెడర్స్ కరోనా టీకాను వినియోగించుకోవాలని మండల వైద్యాధికారి నాగయ్య , పాలకవీడు ఆరోగ్య ఉప కేంద్రం ఇన్చార్జి డాక్టర్ ఆరీఫ్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. నేరేడుచర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సిన్ హర్షణీయం
హుజూర్నగర్ టౌన్ : సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సిన్ వేయడం హర్షణీయమని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్నగర్లోని క్యాంపు స్కూల్లో ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తాసీల్దార్ వజ్రాల జయశ్రీ, మండల వైద్యాధికారి లక్ష్మణ్, వైద్యారోగ్య సిబ్బంది రామకృష్ణ, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.