నూతనకల్, మార్చి 25 : ఉపాధి హామీ నిధుల వినియోగంలో పారదర్శకత ఉండేందుకు పని జరిగిన ప్రాంతంలో సమగ్ర వివరాలతో వర్క్ సైట్ బోర్డులు కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. వర్క్ సైట్ బోర్డులు ఏర్పాటు చేయాలని గతంలోనే నిబంధన ఉన్నప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుత ఆదేశాలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రధాన కూడళ్లలో సమాచార గోడలు ఏర్పాటు చేయనున్నారు. వాటిపై ఉపాధి హామీ పథకం నిధులు, పనులకు సంబంధించిన వివరాలను పొందుపరుస్తారు. బోర్డుల ఏర్పాటు బాధ్యతను పంచాయతీ కార్యదర్శులు తీసుకున్నారు.
రూ.4వేలతో బోర్డు ఏర్పాటు..
రూ.లక్ష, అంతకు మించి నిధులు వినియోగించి పనులు చేసిన చోట రూ.3వేల నుంచి రూపాయలతో సమాచార గోడను నిర్మించాల్సి ఉంది. ఆ గోడపై వివరాలు, కూలీల సంఖ్య, వారికి చెల్లించిన మొత్తం, ఇతర వివరాలను రాయాల్సి ఉంటుంది. నుంచి రూ.600 వరకు ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించారు. మండలంలో మొత్తం 17 గ్రామ పంచాయతీల్లో హరితహారం కింద చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్, చెరువులు, కుంటల మరమ్మతులు, అంతర్గత మట్టి, సిమెంట్ రోడ్లు, కల్వర్టులు, మురుగు కాల్వలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, కంపోస్టు షెడ్లు పనులన్నింటికీ సైట్ బోర్డులను ఏర్పాటు చేశారు.