హుజూర్నగర్టౌన్, మే 20 : కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తు న్న లాక్డౌన్లో ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ భాస్కరన్ సూచించారు. గురువారం సాయంత్రం హుజూర్నగర్ పట్టణంలో అమలవుతున్న లాక్డౌన్ తీరును క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు. పోలీసులు బందోబస్తును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, సంరక్షణ కోసం ప్రభుత్వం విపత్కర పరిస్థితుల్లో లాక్డౌన్ విధించిందన్నారు. ప్రతి పౌరుడు తన వంతు సహకారం అందించాలని కోరారు. లాక్డౌన్ సమయానికి షాపులు యజమానులు స్వచ్ఛందంగా మూసివేసి పోలీసులకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ వెంకట్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర చెక్పోస్టుల పరిశీలన
మఠంపల్లి : లాక్డౌన్ అమలులో భాగంగా మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బందోబస్తు, మట్టపల్లి కృష్ణానది వద్ద ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్పోస్టును హుజూర్నగర్ సీఐ రాఘవరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిసి కట్టుగా పనిచేసినప్పుడే కొవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతామన్నారు. లాక్డౌన్ సడలింపు సమయం 10 గంటల తర్వాత ఎవరూ రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్ఐలు ఎల్లయ్య, కరుణాకర్, ప్రదీప్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
కోదాడలో..
కోదాడ రూరల్ : లాక్డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చినా, సడలింపులో గుంపులుగా ఉన్న నిబంధనల ఉల్లంఘనగా భావించి కేసులు నమోదు చేస్తామని కోదాడ సీఐ నరసింహారావు తెలిపారు. పట్టణంలో లాక్డౌన్ సమయంలో రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న వారికి జరిమానా విధించారు.