బొడ్రాయిబజార్, ఏప్రిల్ 18 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొవిడ్ చర్యలు ముమ్మరం చేశారు. కరోనా సెకండ్ వేవ్తో అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నివారణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పిలుపు మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్ చేశారు. సాంద్రత ఎక్కువగా ఉండే కొత్త బస్టాండ్, హైటెక్ బస్టాండ్, మెయిన్ రోడ్డు, ప్రధాన సెంటర్లలో, చర్చిలు, మసీదులు, దేవాలయాలు, దవాఖానల్లో ఇప్పటికే మాస్కులు లేకుండా బయట వారికి జరిమానా వేస్తూ అప్రమత్తం చేస్తున్న మున్సిపల్ యంత్రాంగం.. వైరస్ తీవ్రతపై ప్రధాన కూడళ్లలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
మాస్క్ లేని వారికి జరిమానా..
కొవిడ్ వ్యాప్తి నివారణలో ముఖ్య వహించే విషయంలో సూర్యాపేట మున్సిపాలిటీ ముందుగానే మాస్క్ లేని వారికి రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేయడంతో మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. మాస్క్ లేకుండా బయట కనిపించినా, దుకాణాలు, షాపింగ్ మాల్స్ వద్ద స్వీయ నియంత్రణ పాటించకున్నా రూ.500 నుంచి వెయ్యి ఫైన్ వేస్తున్నారు. వైపు మున్సిపల్ అధికారులు, పోలీసులు జరిమానా విధిస్తుండగా.. వరకు రూ.10,500 చేశారు. దుకాణాల ముందు నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు పెట్టడంతో ప్రజలు విధిగా మాస్క్ ధరిస్తున్నారు. అయితే.. కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. అత్యవసర పనులుంటేనే బయటకు రావాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో పని ఉంటే అధికారులకు ఫోన్ సంప్రదించాలంటున్నారు.
ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలి
కరోనా సెకండ్ వేవ్ విస్తృతమవుతున్న తరుణంలో ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలి. మాస్క్ ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలి. అన్ని ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేస్తున్నాం. మసీదులు, దేవాలయాలు, బస్టాండ్లు, మార్కెట్లలో స్ప్రే మాస్క్ లేని వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. రూ.500 వెయ్యి వరకు జరిమానా విధిస్తున్నాం. – పి.రామానుజులరెడ్డి, మున్సిపల్ కమిషనర్