సూర్యాపేట రూరల్/ చివ్వెంల, మే 17 : ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వేలో భాగంగా ప్రతి ఇంటినీ కచ్చితంగా పరిశీలించాలని జిల్లా అదనపు కలెక్టర్ పద్మజారాణి సూచించారు. సూర్యాపేట మండలం టేకుమట్ల, ఎండ్లపల్లి, చివ్వెంల మండలం బండమీది చందుపట్ల, జయరాంగుడి తండాల్లో సర్వేను సోమవారం ఆమె జడ్పీ సీఈఓ ప్రేమకరణ్రెడ్డితో కలిసి పరిశీలించి మాట్లాడారు. మొదటి, రెండో సర్వే పూర్తయిన ప్రతి ఇంటిలో మళ్లీ సర్వే చేసి వ్యక్తులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ సర్వే కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తి బాధ్యతతో వహించాలని, జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతునొప్పి, దగ్గు ఉన్నవారికి తప్పనిసరిగా మందుల కిట్ అందించాలన్నారు. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ప్రతి ఇంటినీ, ప్రతి వ్యక్తినీ పరిశీలించి ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ్ద వహించాలని ఆదేశించారు. కరోనా లక్షణాలు ఉండి నా లుగు రోజులైనా తగ్గకుండా ఉంటే వారిని వెంటనే దవాఖానకు తరలించాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పారిశుధ్య పనులు ప్రత్యేక శ్రద్ధ్ద వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తాసీల్దార్ రంగారావు, ఎంపీడీలు శ్రీనివాస్రావు, జమలారెడ్డి, అసర్పంచ్ బోయిళ్ల కృష్ణ, ఎంపీఓ గోపి పాల్గొన్నారు.
హుజూర్నగర్ రూరల్ : మండలంలోని లక్కవరం, వేపలసింగారం, లింగగిరి, అమరవరం, శ్రీనివాసపురం గ్రామాల్లో జ్వర సర్వేను హుజూర్నగర్ ఆర్డీఓ వెంకటరెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరి సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమవుతుందన్నారు. ఆర్డీఓ వెంట తాసీల్దార్ వజ్రాల జయశ్రీ, ఎంపీడీఓ వరప్రసాద్,ఆర్ఐ సూర్యనారాయణ, ఎంపీఓ మౌలానా సిబ్బంది పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్ : మండలంలోని సోలిపేట గ్రామంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీరవోలు శోభరాణి, ఉపసర్పంచ్ నర్ర సుగుణమ్మ, వార్డు సభ్యులు గోగిరెడ్డి వెంకట్రెడ్డి, శివ, సుధాకర్, లక్ష్మమ్మ, ఈదుల భావన, కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
నాగారం : వర్ధమానుకోటలో ఆరోగ్య సర్వే నిర్వహించారు. సర్పంచ్ బోయిని శోభాలింగమల్లు, ఉప సర్పంచ్ ఈదుల కిరణ్కుమార్, కార్యదర్శి ఓరుగంటి నరేశ్, ఆశ వర్కర్లు ఇందిరమ్మ, నాగమణి, విజయలక్ష్మి, సునీత పాల్గొన్నారు.
పాలకవీడు : మండల కేంద్రంలో రెండో విడుత జ్వర సర్వేను తాసీల్దార్ రవికిరణ్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్ లక్షణాలు ఉన్న వారందరికీ కిట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఆర్ఐ జానీపాషా, రాజు పాల్గొన్నారు.
గరిడేపల్లి : మండలంలోని ఇంటింటి సర్వేను, సోడియం హైపోక్లోరైట్ పిచికారీని ఇన్చార్జి ఎంపీడీఓ వనజ పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ కీత జ్యోతీరామారావు తదితరులు పాల్గొన్నారు.
మేళ్లచెర్వు : మండలకేంద్రంలో ఇంటింటి జ్వర సర్వేను ఎంపీడీఓ ఇసాక్ హుస్సేన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను కట్టడి చేయడం కోసం ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి రావొద్దని కోరారు. సర్వేల్లో పంచాయతీ కార్యదర్శులు, ఆశ కార్యకర్తలు, రెవెన్యూ సిబ్బంది, అంగన్వాడీలు పాల్గొన్నారు.