ఆకు కూరల సాగులో రాణిస్తున్న మహిళలు
ఆర్థిక స్వావలంబన దిశగా పయనం
చౌటుప్పల్ రూరల్, జూన్ 13: చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మోజిగూడెం గ్రామానికి చెందిన మహిళలు ఆకు కూరల సాగులో రాణిస్తున్నారు. తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తూ, ఆర్థిక స్వా వలంబన దిశగా పయనిస్తున్నారు. గ్రామానికి చెం దిన సుమారు 50 మంది మహిళలు అతి స్వల్ప పెట్టుబడితో వేలాది రూపాయల ఆదాయం పొం దుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రత్యేకత చాటుకుంటున్నారు. పాలకూర, చుక్కకూర, కొయ్యిగూ ర, పుదీనా, కొత్తిమీర, పుంటికూర, మెంతికూర తదితర ఆకుకూరలు సాగుచేస్తూ లాభాలను గడిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే తమ పం ట పొలాల్లోకి వెళ్లి ఆకుకూరలను సేకరిస్తారు.
వాటి ని చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని మార్కెట్కు తరలించి వారే విక్రయిస్తారు. మార్కెట్కు తీసుకొచ్చే ఆకుకూరల్లో ధర్మోజిగూడెం గ్రామ మహిళా రైతు లు తీసుకొచ్చినవే అధికంగా ఉంటాయి. మార్కెట్లో దాదాపుగా 70 శాతం పైగా వీరి ఆకుకూరలే. ఇలా ప్రతిరోజూ ఒక్కొక్కరు సుమారు రూ. 500 నుంచి 1,000 వరకు ఆదాయం పొందుతున్నారు. మార్కె ట్లో విక్రయించిన అనంతరం సాగు చేసిన పంటకు కావాల్సిన నీటి సరఫరా, పిచ్చిమొక్కల తొలగింపు పనుల్లో నిమగ్నమవుతారు. ఇందుకు కుటుంబసభ్యుల సహకారం కూడా తీసుకుంటారు.
అర ఎకరం నుంచి..
మహిళలే ప్రత్యేక శ్రద్ధతో ఆకుకూరల సాగు చేపడుతున్నారు. వారికి ఉన్న భూమిలో ర ఎకరం నుంచి ఎకరం వరకు వివిధ రకాల ఆకుకూరలు సాగు చేస్తున్నారు. దీంతో తమ కుటుంబానికి అండగా నిలవడంతోపాటు ఆర్థిక స్వావలంబన దిశగా సాగుతున్నా రు. చౌటుప్పల్ పరిసర గ్రామాలేకాకుండా చిట్యా ల, వల్లిగొండ, పోచంపల్లి, సంస్థాన్నారాయణపురం తదితర ప్రాంతాల నుంచి కూరగాయల వ్యాపారులు ఇక్కడికొచ్చి హోల్సెల్గా కొనుగోలు చేస్తారు.
కొన్ని నెలలుగా సాగు చేస్తున్నా
కొన్ని నెలలుగా ఆకుకూరలు సాగు చేస్తున్నా. కొవిడ్ వైరస్ నేపథ్యంలో గిరాకీ అంతగా లేదు. అంతకుముందు వివాహాల సమయంలో మంచి లాభాలు వచ్చేవి.
సామిడి సత్తమ్మ, మహిళా రైతు
మార్కెట్లో విక్రయిస్తా..
అర ఎకరం భూమిలో ఆకుకూరల పం టను సాగుచేశా. ప్రతిరోజూ ఉదయమే వా టిని సేకరించి మార్కెట్కు తీసుకెళ్తా. అక్కడే వాటిని విక్రయించి ఇంటికొస్తా. అనంతరం కలుపుతీయడం, నీరు పెట్టే పనులు చేస్తా.
ఏనుగు అలివేలు, మహిళా రైతు