సూర్యాపేట టౌన్, మే 12 : మహమ్మారిని ప్రారంభంలోనే అరికట్టాలనే లక్ష్యంతో రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే కార్యక్రమం సూర్యాపేట జిల్లాలో బుధవారం ముగిసింది. ఈ సర్వేలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 802 టీమ్లు సుమారు 7 రోజులపాటు పనిచేశాయి.ప్రతి టీమ్లో ఆశ కార్యకర్త, అంగన్వాడీ, మెప్మా, మున్సిపల్ సిబ్బంది ఒక్కొక్కరు చొప్పున నలుగురు ఉన్నారు. వారు ఇంటింటికీ తిరిగి జ్వర పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి ప్రతి ఒక్కరికీ పల్స్, ధర్మామీటర్ల పరీక్షలు చేశారు. 45 సంవత్సరాలు నిండిన గుర్తించి టీకా వేయించుకునేలా అవగాహన కల్పించారు. వ్యాప్తంగా మొత్తం 3,16,069 గృహాల్లో సర్వే నిర్వహించి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలున్న 7,536 మందిని గుర్తించారు. వారందరికీ ప్రత్యేక మెడికల్ కిట్లు అందజేశారు.జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సర్వే ద్వారా 7,536 మందిని స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని గుర్తించామని. వారిలో జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నాయని డాక్టర్ కోటాచలం తెలిపారు. వారందరికీ ప్రభుత్వం అందించిన కిట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. సర్వేలో పాల్గొన్న సిబ్బందికి, సహకరించిన ప్రజలందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.