మేళ్లచెర్వు/మఠంపల్లి /నేరేడుచర్ల / హుజూర్నగర్ రూరల్/ మునగాల/ చిలుకూరు, జూన్ 4 : హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయస్వామికి శుక్రవారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లోని ఆంజనేయస్వామి ఆలయాల్లో తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, తమలపాకులు, మల్లెపూలతో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. 108 కలశాలతో హనుమాన్కు అభిషేకాలు, మన్యసూక్త హోమం నిర్వహించారు. చిలుకూరు గ్రామ శివారులోని అభయాంజనేయ స్వామి ఆలయంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, జూనియర్సివిల్ జడ్జి ప్రియాంక, హుజూర్నగర్ మండలం గోపాలపురం ఆలయంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని హనుమాన్ ఆలయంలో అర్చకుడు శ్రీమాన్ సీహెచ్ పద్మనాభాచార్యులు పూజలు నిర్వహించారు. ముందుగా శ్రీస్వామి వారికి పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించి పట్టువస్ర్తాలు అలంకరించారు. పాత నేరేడుచర్ల ఆంజనేయ స్వామి, శివాలయంలోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో స్వామి వారి విగ్రహాన్ని సింధూరం, తమలపాకులతో సుందరంగా అలకరించారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దైవ దర్శనం చేసుకున్నారు. మునగాల శ్రీరామలింగేశ్వర హనుమాన్ ఆలయంలో అర్చకులు నిర్వహించారు.
హనుమంతుడికి అంతరంగిక పూజలు
హనుమాన్ జయంతి సందర్భంగా పట్టణంలోని భక్తాంజనేయస్వామి, వేదాంత భజన మందిరం ఆలయాల్లో హనుమంతుడికి శుక్రవారం అంతరంగిక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవచనం, రక్షాబంధనం, కలశ స్థాపన, అఖండ దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా సుందరకాండ, సుదర్శన శతకం, విష్ణు సహస్రనామ పారాయణాలు చేశారు. కరోనా నేపథ్యంలో భక్తులను అనుమతించలేదు. కార్యక్రమంలో భక్తాంజనేయస్వామి దేవాలయ ప్రధానార్చకులు ధరూరి రామానుజాచార్యులు, శ్రీధరాచార్యులు, శ్రీనాథాచార్యులు, ఆచార్య ఆత్రేయ, దేవాలయ చైర్మన్ కొత్త ఆంజనేయులు, కీసర దేవేంద్రచారి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంపీ లక్ష్మణ్రావు పాల్గొన్నారు.
అంతర్జాలంలో ఆధ్యాత్మిక ప్రవచనం : విద్యార్థులు, యువత హనుమంతుడిలోని సేవా పారాయణత, ధైర్య సాహసాలు, సమయస్ఫూర్తి, విధేయత, స్వామిభక్తి వంటి దివ్య గుణాలు అలవర్చుకోవాలని జగద్గురు గీతాశ్రమ వ్యవస్థాపకుడు బ్రహ్మశ్రీ జ్ఞాన చైతన్యానంద స్వామీజీ అన్నారు. భానుపురి శ్రీనివాస భజన మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాల సమావేశంలో స్వామీజీ పాల్గొని ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. అనంతరం గుండా సోమశేఖర్ జ్ఞాపకార్థం అంతర్జాల వేదికగా నిర్వహించిన హనుమాన్ చాలీసా కంఠస్థ పోటీల విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. సమావేశంలో భజన మండలి అధ్యక్షుడు నాగవెల్లి దశరథ, సభ్యులు రాగి భాస్కరాచారి, రామడుగు రాంబాబు, శ్రీనివాసాచారి, రాధిక, శ్రీలత, ప్రభాకర్, ప్రవాస భారతీయులు, విద్యార్థులు
చివ్వెంల : ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామికి బ్రహ్మశ్రీ మనోహరశర్మ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పంచామృత అభిషేకం, ఆకుపూజ, లక్ష్మీనరసింహ స్వామి వరమాల, మూల మంత్ర హోమం నిర్వహించారు. దేవస్థాన అభివృద్ధి కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆదుర్తి రామయ్య, చైర్మన్ చకిలం కృష్ణకుమార్, ఆలయ అర్చకుడు కృష్ణమాచార్యులు, కృష్ణమోహన్, పద్మ నాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్ పిల్లలమర్రి గ్రామంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి దేవాలయంలో ప్రసన్నాంజనేయ స్వామికి విశ్వక్సేణ పూజ, పుణ్యాహవాచనం, నవ కలశ స్థాపన, పంచామృత అభిషేకం, సింధూర లేపనం, పుష్పాలంకరణ, అష్టోత్తర పుష్ప, ఫల అర్చన కార్యక్రమాలు చేశారు. కార్యక్రమంలో దేవాలయ సమన్వయ కమిటీ సభ్యులు రాపర్తి మహేశ్కుమార్, కొరివి సతీశ్, అర్చకుడు ముడుంబై రఘువరకృష్ణమాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ విగ్రహానికి అభిషేకాలు, పూజలు చేశారు. మండల కేంద్రంలోని యోగానంద లక్ష్మీనృసింహస్వామి ఆలయంలోని హనుమంతుడికి భక్తులు పూజలు చేశారు.