ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఏటా పదో తరగతిలో ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరుగుతున్నది. అదే సమయంలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో మాత్రం పురోగతి ఉండడం లేదు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో 40 జూనియర్ కళాశాలల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మార్చి 15 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానుండగా, చదువులో వెనుకబడిన విద్యార్థులపై అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
నేరేడుచర్ల, జనవరి 19 : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్ల్లో చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏటా పదో తరగతిలో ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరుగుతుంది. ఇంటర్లో మాత్రం ఫలితాల్లో పురోగతి ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో పాటు విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి సా రించారు. పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు ఈసారి కళాశాల్లో కూడా ప్రత్యేక తరగతుల నిర్వహణ చేపట్టారు.
సూర్యాపేట జిల్లాలో మొత్తం 73 కళాశాలు ఉన్నా యి. వాటిలో ప్రభుత్వం- 40, ప్రైవేటు- 33 ఉన్నా యి. ఆయా కళాశాలల్లో 19,738 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో ప్రథమ 8,626, ద్వితీయ సంవత్సరంలో 11,112 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఫిబ్రవరి 15 నుంచి, వార్షిక పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలల్లో డిసెంబర్ చివరి నాటికి పా ఠ్యాంశాలు పూర్తి చేశారు. జనవరి నుంచి ప్రత్యేక తరగతుల నిర్వహిస్తున్నారు. గత నెలలో ఆరు నెలల పరీక్షలు నిర్వహించి అందు లో వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేకంగా చదివిస్తున్నారు. ఎప్పటికప్పుడు పాఠ్యాంశాల వారీగా వి ద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. అన్ని గ్రూపుల్లో వెనుకబడిన వారికి ఉదయం, సాయం త్రం తరగతులు నిర్వహించి తీర్చిదిద్దుతున్నారు.
ప్రతి విద్యార్థ్ధిపై ప్రత్యేక శ్రద్ధ
పాఠ్యాంశాలు మొత్తం త్వరగా పూర్తి చేసిన ఉపాధ్యాయులు విద్యార్థ్ధులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతు ఉద యం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. నిరంతరం స్లిప్ టెస్టులు నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతు చదువులో మెరుగు పడే విధంగా వారికి సందేహాలను నివృత్తి చేస్తున్నారు.
ప్రత్యేక తరగతులు ఉపయోగపడుతున్నాయి
ప్రస్తుతం పాఠ్యాంశాలను చదివిస్తున్నారు. అధ్యాపకులు శ్రద్ధతో బోధిస్తున్నారు. ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకుంటున్నా. ప్రత్యేక తరగతులు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. గతంలో సిలబస్ పూర్తి కాక తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. పరీక్షలు సమీపిస్తున్న చదువు కోవడానికి సమయం లేదు. ఈ సారి ప్రత్యేక తరగతులను నిర్వహించడంతో పరీక్షలు రాయడానికి మంచిగా సిద్ధం అవుతున్నాం.
– రాధ, మొదటి సంవత్సరం, విద్యార్థి, నేరేడుచర్ల ప్రభుత్వ కళాశాల
ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం
గతంలో కంటే ఈ సారి మంచి ఫలితాలు వచ్చే విధంగా విద్యార్థ్ధులను చదివిస్తున్నాం. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం వల్ల ఉత్తీర్ణత శాతం పెరుగనుంది. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి భ యం లేకుండా చేస్తున్నాం. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ రివిజన్ సైతం చేపట్టాం.