నేరేడుచర్ల: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేఖ చట్టాలను వెంటనే రద్దు చేయాలని అఖిల భారత రైతు సమా ఖ్య రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వస్కుల మట్టయ్య, వల్లెపు ఉపేందర్ రెడ్డిలు డిమాండ్ చేశారు. మంగళవారం నేరేడు చర్లలో నిర్వహించిన ఏఐకేఎఫ్ ఉమ్మడి జిల్లా కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా హజారయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేఖ, రాజ్యంగ వ్యతిరేక విధానాలపై ప్రజ లు, రైతులు పోరాడాలన్నారు. పది నెలలుగా ఢిల్లీ సరిహద్దులలో రైతులు పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వ వైఖరి మారకపోవడం వారి రాక్షక పాలనకు నిదర్శనమన్నారు. కేంద్రం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలకు నిరసనగా ఈనెల 27న చేపట్టే భారత్ బంద్ను పార్టీలకు అతీతంగా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో ఏ.ఐ.ఏ.డబ్యూ.ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరికుప్పల వెంకన్న, ఏ.ఐ.ఎఫ్.డీ.డబ్యూ రాష్ట్ర అధ్యక్షురాలు వస్కుల సైదమ్మ, నాయకులు రెడపంగ మల్లయ్య, నజీర్, మచ్చ బాబు, సుకన్య, వెంకన్న, గోపి, నగేశ్, రామచంద్రయ్య పాల్గొన్నారు.