మోతె: ఐదు రోజుల నుంచి కురుస్తున్నభారీ వర్షాలకు మండల పరిధిలోని నామవరంలో పెద్ద చెరువు అలుగు పోసింది. దాని వరద ప్రభావానికి రోడ్డు తెగిపోయింది. కాగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామవరం నుంచి జాతీయ రహదారికి వేళ్లే రోడ్డు నామవరం పెద్ద చెరువు అలు గు పోసి వరద ఎక్కువగా రావడంతో రోడ్డు తెగిపోయిందని ఈ మార్గంలో రాకపోకలు నిలిపివేయాలని అధికారులను సూచించారు. వీలైనంత త్వరలో ఇక్కడ బ్రిడ్జి మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.
మండలంలో భారీగా వరద ప్రభావం ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆయన వెంట తహసీల్దార్ యాదగిరి, ఎంపీడీవో శంకర్రెడ్డి, ఎంపీవో హరిసింగ్, సర్పంచ్ తండు యాదమ్మ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.