కోదాడ : ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలవాలని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. ఆదివారం స్థానిక గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గత 30 ఏళ్లుగా మంత్రి ఉత్తంతోపాటు తనకు ఆర్యవైశ్య సంఘాలతో విడదీయని అనుబంధం ఉందన్నారు. ఆర్యవైశ్య సేవా స్ఫూర్తి సమాజానికి ఆదర్శమని కొనియాడారు. ఆర్యవైశ్యుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానన్నారు. ఏ సమస్య ఉన్న తనను నేరుగా కలవవచ్చున్నారు. ఆర్యవైశ్య భవన నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.
అనంతరం నూతన అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సోమనర్సయ్య, కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్ తో పాటు కార్య వర్గానికి రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, మహిళా విభాగంలో ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలుగా గరినే ఉమామహేశ్వరి, ప్రధాన కార్యదర్శిగా విజయలక్ష్మి, కోశాధికారిగా వెంకటలక్ష్మి తోపాటు కార్యవర్గాన్ని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉప్పల శారద, జిల్లా రాజకీయ విభాగ చైర్మన్ కక్కిరిని శ్రీనివాస్ మీడియా విభాగ చైర్మన్ వంగవీటి శ్రీనివాసరావు ఎన్నారై విభాగం చైర్మన్ ఇరుకుల చెన్నకేశవరావు వర్కింగ్ ప్రెసిడెంట్ ఓరుగంటి నాగేశ్వరరావు లచే ఇరుకుల్ల రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం జిల్లా యువజన సంఘం అధ్యక్షులుగా బొమ్మిడి అశోక్, ప్రధాన కార్యదర్శిగా చల్ల అశోక్, కోశాధికారిగా స్వామి గణేష్ , ఉపాధ్యక్షులుగా డాక్టర్ భరత్ చంద్ర, ఇమ్మడి అనంత చక్రవర్తి, భరత్ ,సాయి, ప్రవీణ్ లచే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఊరే లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, మాశెట్టి అనంత రాములు, తదితరులు పాల్గొన్నారు.