సూర్యాపేట: జిల్లాలోని తుంగతుర్తి పరిధిలోని తిరుమలగిరిలో మూడో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం తిరుమల గిరిలోని నాలుగో వార్డును పరిశీలించారు. పట్టణ ప్రగతి సందర్భంగా చేయాల్సిన పనులకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గాదారి కిశోర్ కుమార్కు పలు సూచనలు చేశారు. పది రోజులపాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో పట్టణంలో ఎక్కడా చెత్త కనిపించకూడదని, నీరు నిలువడానికి వీళ్లేదని అధికారులను స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హరిత హారంలో భాగంగా మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక మున్సిపల్ చైర్మన్ రజనీ రాజశేఖర్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.