మేళ్లచెర్వు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు. బుధవారం మండలంలోని రేవూరు ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతి గదిలో విద్యార్ధులతో మాట్లాడారు.
వారు భౌతిక దూరం పాటిస్తూ, శాని టైజర్, మాస్కులను ఉపయోగించేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట ఎంపీపీ కొట్టె పద్మాసైదేశ్వర్రావు, ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్, వైస్ ఎంపీపీ గాయం గోపిరెడ్డి, ఎంపీవో వీరయ్య, ఎంఈవో సైదానాయక్, ప్రజాప్రతినిధులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.