మఠంపల్లి: కృష్ణానది తీరాన వేంచేసియున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన మట్టపల్లిలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత నర సింహుని కల్యాణం అర్చకులు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంభించి అనంతరం స్వామి వారి కల్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు.
పట్టు వస్ర్తాలతో అలం కరించి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అత్యంతవైభవంగా కల్యాణతంతు నిర్వహించా రు. అనంతరం భక్తులకు దైవ దర్శనంతో పాటు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, ఈవో నవీన్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.