మఠంపల్లి: టీఆర్ఎస్ కమిటీల్లో స్థానం పొందిన నాయకులు పార్టీ బలోపేతానికి పని చేయాలని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు. మండలంలో గ్రామ కమిటీలు, మండల కమిటీలు పూర్తయిన సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో టీఆర్ఏస్ పార్టీ యూత్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
రానున్న ఎన్నికలే లక్ష్యంగా యువత పార్టీ బలోపేతానికి సైనికుల్లా పని చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరొకటి లేదన్నారు. ముందుగా ర్యాలీగా బయలుదేరి తెలుగుతల్లి, తెలంగాణ అమరుడు శ్రీకాంత చారి, డా బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అభివృద్ధిపై పోటీ పడి పనిచేద్దామని విమర్శలపై కాదని అన్నారు.
కార్యక్రమంలో మండల టీఆర్యస్ అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య,్ర పధాన కార్యదర్శి భూక్యా అశోక్, ఉపాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, జిల్లా రగ్భీ అసోసియేషన్ అధ్యక్షుడు, సర్పంచ్ మన్నెం శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గుండా బ్రహ్మారెడ్డి, మాజీ ఎంపీపీ కొండానాయక్, కోలాహలం కృష్ణంరాజు, పఠాన్ హఫీజ్ఖాన్, మహిళా అధ్యక్షురాలు కందుల నాగలక్ష్మీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పల్లె మట్టయ్య, పార్టీ అధికార ప్రతినిధి రవీందర్నాయక్, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, కార్యకర్తలు పాల్గొన్నారు.