హుజూర్నగర్ టౌన్ : హుజూర్నగర్ మున్సిపాలిటీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం 8వార్డులో కౌన్సిలర్ సౌజన్యతో కలిసి పట్టణ ప్రగతి నిధుల నుంచి మంజూరైన రూ. 3.50 లక్షలతో సీసీ డ్రైన్, 14 ఫైనాన్స్ నిధుల నుంచి మంజూరైన రూ. 2లక్షలతో కళావేదిక పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే గోవిందపురంల ఎస్సీ కమ్యూనిటీహాల్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఇటీవల మరణించిన బండి భాస్కర్, తోకల కరుణల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.
కార్యక్రమంలో వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు టీఆర్ఎస్ నాయకులు గెల్లిరవి, అమర్నాధ్రెడ్డి, అమర్, కె.ఎల్.ఎన్.రెడ్డి, కౌన్సిలర్లు గుండా ఫణికుమారి, ఓరుగంటి నాగేశ్వరరావు, అమరబోయిన సతీశ్, గంగరాజు, ములకలపల్లిరాం గోపి, ఇతర నాయకులు దొంతిరెడ్డి పద్మ, కుంటసైదులు పాల్గొన్నారు.