సూర్యాపేట: జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం రాష్ట్ర ప్రభత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో ఏస్పీ ఆర్ భాస్కరన్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలపై ఇప్పటికే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. ఉన్నతాధికారులంతా క్షేత్ర స్థాయిలో ఉండాలన్నారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించిందని ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఏస్ మోహన్రావు, పాటిల్ హేమంత్ కేశవ్, నీటి పారుదల ఈఈ భద్రు నాయక్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఏవో రామారావు నాయక్, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, విద్యుత్శాఖ అధికారులు పాల్గొన్నారు.