నేరేడుచర్ల: ప్రపంచ ఎయిడ్స్ డేను పురష్కరించుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బుధవారం హుజూర్నగర్లోని ప్రధాన రహాదారిపై ఎయిడ్స్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపాల్ చందా అప్పారావు మాట్లాడుతూ లైంగిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఎయిడ్స్ను పారదోలడానికి అవకాశం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, నాగేష్, అనిల్కుమార్, సైదులు, నాగార్జున, వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, రవికుమార్, మల్లికార్జున్, నిఖిల్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.