కోదాడ రూరల్: కోదాడ పట్టణ పరిధి కోమరబండకు చెందిన దేవపంగు ఇంద్రకిరణ్ కాలినడకన హైద్రాబాద్ నుంచి బయలుదేరి బుధవారం ముంబ యికి చేరుకుని తన అభిమాన సినీ నటుడు, సమాజ సేవకుడు సోన్సూద్ను కలిసినట్లు ఇంద్రకిరణ్ కుటుంబ సభ్యులు తెలిపారు.
హైదరాబాద్ నుంచి ఆగస్టు 30న నడక ప్రారంభించిన ఇంద్రకిరణ్ సుమారు ఆరు వందల కిలోమీటర్లు నడిచి 10వ రోజు ముంబయిలో సోనూసూద్ ఇంటికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా తాను రాసిన పాటల సీడీని ఆయన చేతుల మీదుగా విడుదల చేయించి అభిమానం చాటుకున్నాడు.